News February 7, 2025
కమలాపూర్: జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కేజీబీవీ విద్యార్థిని

కమలాపూర్లోని కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ పంగిడిపల్లికి చెందిన కౌడగాని సుష్మ SGFI అండర్-19 ఫెన్సింగ్ గేమ్ విభాగంలో ఈనెల 8న పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్వో అర్చన తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన సుష్మ జాతీయస్థాయి పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతుండటంతో కేజీబీవీ స్టాఫ్, మరికొందరు దాతల సహకారంతో ఆమెకు రూ.30 వేలు ఆర్థిక సాయంగా అందజేసినట్లు అర్చన తెలిపారు.
Similar News
News February 12, 2026
ఉత్తరంలో ఇల్లు కడితే కుబేరులు అవుతారా ?

ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ దిశలో ఇల్లు కడితే సంపన్నులవుతారని కొందరి అభిప్రాయం. అయితే ఇలా ఉత్తరదిశలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న అందరూ కుబేరులవుతారనడం అపోహేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. ఈ వాస్తు నియమం పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సకల కార్యాలు పూర్తయ్యేలా దోహదం చేస్తుందని చెబుతున్నారు. సంపద పెరిగే అవకాశాలు మెరుగుపడుతాయే తప్ప సంపద పెరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 12, 2026
భీమవరంలో అన్న క్యాంటీన్ని పరిశీలించిన జేసీ

భీమవరం పాత బస్టాండ్ వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను గురువారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేదలకు రూ.5లకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్యాంటీన్లోని భోజన పంపిణీ, తాగునీరు, సర్వింగ్ ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. వాష్ ఏరియాను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.
News February 12, 2026
NTR: మొదలైన “బిట్స్” క్యాంపస్ పనులు.. మంత్రి లోకేశ్ ట్వీట్

అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ& సైన్స్(బిట్స్) సంస్థ క్యాంపస్ నిర్మాణ పనులు మొదలయ్యాయంటూ మంత్రి లోకేశ్ గురువారం ట్వీట్ చేశారు. కాగా మందడం, వెంకటపాలెంలో క్యాంపస్ నిర్మాణానికి ఆ సంస్థకు 70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో రూ.1,000 కోట్లతో అమరావతిలో బిట్స్ క్యాంపస్ నిర్మిస్తుండగా..AI, ఆవిష్కరణలకు అమరావతి కేంద్రంగా మారుతోందని లోకేశ్ పేర్కొన్నారు.


