News March 2, 2025

కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

image

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్‌కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 13, 2025

అనకాపల్లి జిల్లాలో రేపటి పరీక్షలు వాయిదా: డీఈవో

image

బాలల దినోత్సవం వేడుకలు నేపథ్యంలో పాఠశాలల్లో శుక్రవారం జరగాల్సిన SA-1 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అనకాపల్లి DEO అప్పారావునాయుడు గురువారం ప్రకటించారు. పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని సూచించారు. రేపు ప్రైమరీ తరగతులకు జరగాల్సిన EVS పరీక్ష ఈనెల 17న, 6-10తరగతులకు జరగాల్సిన ఫిజికల్ సైన్స్ పరీక్ష 20న పెట్టాలని సూచించారు. మిగతా పరీక్షలు యథావిథిగా జరుగుతాయన్నారు.

News November 13, 2025

రామగిరి: సింగరేణి భూసేకరణ, పరిహారంపై కలెక్టర్ సమీక్ష

image

సింగరేణి భూసేకరణ పనులను సజావుగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి పరిహారాలను త్వరగా చెల్లించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం రామగిరి తహశీల్దార్ కార్యాలయంలో భూసేకరణ అంశాలపై ఆయన సమీక్షించారు. సింగరేణి సంస్థ అవసరమైన వివరాలు అందించినందున, ఎస్.డీ.సీ., తహశీల్దార్, ఎంపీడీఓ, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

News November 13, 2025

కొండా సురేఖ క్షమాపణలు.. కేసు విత్‌డ్రా చేసుకున్న నాగార్జున

image

TG: మంత్రి కొండా సురేఖ <<18263475>>క్షమాపణలు<<>> చెప్పడంతో సీనియర్ హీరో నాగార్జున పరువునష్టం కేసును విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆ కేసును కొట్టివేసింది. కాగా నిన్న కొండా సురేఖ నాగార్జునకు ట్విటర్ (X) వేదికగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం రేపాయి. దీంతో నాగార్జున ఆమెపై పరువునష్టం దావా వేశారు.