News March 2, 2025
కమలాపూర్: రూ.9,51,000ల సైబర్ మోసం

సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.9,51,000 పోగొట్టుకున్న ఘటన కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సీఐ హరికృష్ణ కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మనోజ్కు టెలిగ్రామ్ ద్వారా బావి జోషి అనే అడ్రస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. టాస్క్ ఆడితే డబ్బులు రెట్టింపు అవుతాయని తెలుపగా విడతల వారీగా రూ.9.51లక్షలు వేశారు. ఎంతకూ నగదు రెట్టింపు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News October 28, 2025
తణుకు: ఇద్దరు డీఎస్పీలు ఒక్కటయ్యారు

ప.గో జిల్లా తణుకులో ఇద్దరు DSPల వివాహ మహోత్సవం జరిగింది. గతంలో చందోలు PSలో ట్రైనింగ్ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ(స్వగ్రామం ప.గో(D) పాలంగి), పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక ఆదివారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. పోలీసు శాఖలో ఒకే క్యాడర్లో ఉన్న అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం.
News October 28, 2025
ప్రతి ఊర్లో హనుమాన్ ఆలయం ఎందుకు ఉంటుంది?

హనుమంతుడు అపారమైన శక్తి, ధైర్యం, నిస్వార్థ భక్తికి ప్రతీక. ప్రజలు ఆయనను కష్టాలను తొలగించే ఆపద్బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా నమ్ముతారు. రాముని సేవలో ఆయన చూపిన నిష్ఠ కారణంగా ఆయన్ని ఎక్కడ పూజించినా రాముని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే గ్రామాన్ని, ప్రజలను రక్షించే రక్షక దేవతగా ప్రతి ఊరిలో ఆయన ఆలయాన్ని నిర్మించడం భారతీయ సంప్రదాయంగా మారింది. ఆయనను పూజిస్తే ధైర్యం, బలం లభిస్తాయని నమ్ముతారు.
News October 28, 2025
ASF: ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్ట్: ఎస్పీ

సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం తెలిపారు. గత మే 21న వాట్సాప్ లింక్ పంపించి ఆసిఫాబాద్కి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1.66 లక్షలు కాజేశారు. అదే నెల 27న బాధితుడు ఆసిఫాబాద్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు రూ.60 వేలను ఫ్రీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


