News July 30, 2024
కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు: MLAలు

కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని రామగుండం MLA రాజ్ ఠాకూర్, పెద్దపల్లి MLA చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి హరీష్ రావులు కాళేశ్వరంపై చేస్తున్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఎకరాకు నీరు రాలేదని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.
Similar News
News October 15, 2025
KNR: బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన సదస్సు

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కరీంనగర్ హెల్త్ క్లబ్, రెడ్డీస్ లాబరేటరీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ డా.డి.వరలక్ష్మి అధ్యక్షతన, డాక్టర్ ఎం. ప్రతిష్ఠ రావు Reproduction concern Grenz, మహిళలలో వచ్చే Breast Cancer, PCDD పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ క్లబ్ కో ఆర్డినేటర్ డా. నజియా, జె.రజిత, డి.స్వరూప రాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
News October 15, 2025
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ట ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర నిన్నటి లాగానే నిలకడగానే ఉంది. మంగళవారం యార్డుకు 951 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్టంగా క్వింటాకు రూ.6,400, కనిష్టంగా రూ.5,000 ధర పలికింది. గోనెసంచుల్లో 38 క్వింటాళ్లు తీసుకొని రాగా గరిష్టంగా రూ. 6,000 ధర లభించింది. మార్కెట్ కార్యకలాపాలను మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పరిశీలించారు.
News October 14, 2025
కరీంనగర్: ‘ఆరోగ్య మహిళ’ సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లా సప్తగిరి కాలనీ ఆరోగ్య కేంద్రంలో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఉచిత వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ప్రతిమ ఫౌండేషన్ మొబైల్ వాహనంలో 2డీ ఎకో, ఎక్స్రే, మమ్మోగ్రఫీ పరీక్షలను కలెక్టర్ పరిశీలించారు.