News March 15, 2025

కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలి: పి.నారాయణ బాబు

image

భూపాలపల్లి జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి డిగ్రీ చదువుకొని ఉచితంగా సేవ చేయాలనే గుణం కలిగిన యువత కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నారాయణ బాబు తెలిపారు. కేసులను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే బృహత్తర కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని వారన్నారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

Similar News

News April 21, 2025

విశాఖలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం 

image

ద్వారకానగర్‌లో ఎస్టీ, ఎస్సి విద్యార్థుల ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీఎస్సీ అభ్యర్థులు పాలాభిషేకం చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ  వేపాడ చిరంజీవరావు, తదితరులు పాల్గొన్నారు. 

News April 21, 2025

సోషల్ మీడియాను మంచి కోసం వాడండి: అన్నమయ్య ఎస్పీ

image

సోషల్ మీడియాను కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగించాలని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. విజ్ఞానాన్ని పంచేందుకు వాడాలి కానీ విధ్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదన్నారు. మీరు చేసే పోస్టులు ఇతరుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అన్నారు.పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి వెబ్ ఆక్టివిటీస్ గమనించాలన్నారు.

News April 21, 2025

సమస్యలు ఉంటే తెలపండి: కడప కలెక్టర్

image

రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కానీ వాటిపై నేరుగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. దీంతో పాటు డయల్ యువర్ కలెక్టర్ ద్వారా 08562-244437 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను తెలపవచ్చన్నారు.

error: Content is protected !!