News August 11, 2024
కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన పొదిలి విద్యార్థులు

విజయవాడలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి కుంఫూ, కరాటే పోటీల్లో పొదిలి విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. కరాటే మాస్టర్ కఠారి చిన్నరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు పలు విభాగాల్లో కట్టాస్, స్పారింగ్లో బంగారు, రజత పతకాలు సాధించారు. స్పారింగ్లో పలు వయస్సుల విభాగాల్లో చిట్టెం షాలూమ్, జోయల్ జశ్వంత్, షేక్ సూఫియా బంగారం పతకాలు సాధించారు. దీంతో విద్యార్థులను పలువురు అభినందించారు.
Similar News
News November 22, 2025
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్…!

ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉందని ఆర్ఐఓ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. ఫస్ట్ ఇయర్కు సంబంధించి 22,265 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్కు సంబంధించి 19,163 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలతో కలిపి 183 కళాశాలలు ఉన్నాయని, ఫీజు చెల్లించని విద్యార్థులు రూ. 2 వేలు ఫైన్తో 25వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.
News November 22, 2025
ప్రకాశం: భార్య.. భర్త.. ఓ ప్రియురాలు

వివాహితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నెల్లూరులో జరిగింది. కలిగిరి(M) ఏపినాపికి చెందిన విష్ణువర్ధన్కు సరితతో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. కాగా ఇటుకబట్టీల వద్ద పనిచేసే క్రమంలో ధనలక్ష్మితో పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వీరు పామూరులోని లాడ్జిలో ఉన్నారని తెలియడంతో సరిత తన భర్తను కలిగిరికి తీసుకొచ్చింది. ప్రియురాలిని దూరం చేశారంటూ విష్ణువర్ధన్ ఆత్మహత్యకు యత్నించగా భార్య ఆసుపత్రిలో చేర్చింది.
News November 22, 2025
రేపు ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

ఒంగోలులోని డాక్టర్ BR అంబేడ్కర్ భవనంలో ఆదివారం 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కరాటే మాస్టర్ వెంకటేశ్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు.


