News May 12, 2024
కరీంనగర్లో ముగిసిన ప్రచారం.. గెలుపెవరిదో..!

గత నెల రోజుల నుంచి జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్య పార్టీల ఎంపీ అభ్యర్థులతో పాటు ఆ పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇక మిగిలింది ప్రజల నిర్ణయమే. కాగా.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బోయినపల్లి వినోద్ కుమార్-BRS, వెలిచాల రాజేందర్ రావు-కాంగ్రెస్, బండి సంజయ్-BJP బరిలో ఉన్నారు. మరి గెలుపెవరిదో చూడాలి.
Similar News
News March 13, 2025
కరీంనగర్: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సిపి గౌస్ ఆలం

శుక్రవారం జరుపుకోనున్న హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. బలవంతంగా ఇతరులపై రంగులు వేయవద్దని, ఘర్షణ వాతావరణంలో పండగను జరుపుకోవద్దని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి హోలీ పండుగను రంగుల మయంగా ఆనందకరంగా జరుపుకోవాలని అన్నారు. స్నానానికి ప్రమాదకరమైన నీటిలో దిగవద్దని తెలిపారు.
News March 13, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 39.9°C నమోదు కాగా, కొత్తపల్లి-ధర్మారం, వెంకేపల్లి 39.8, జమ్మికుంట 39.7, గంగాధర 39.6, ఖాసీంపేట 39.5, ఇందుర్తి, ఈదులగట్టేపల్లి 39.2, వీణవంక 39.0, నుస్తులాపూర్ 38.9, బోర్నపల్లి, తాంగుల 38.7, అర్నకొండ, గుండి 38.5, గంగిపల్లి 38.3, పోచంపల్లి 38.2, మల్యాల 38.0, దుర్శేడ్ 37.9, చింతకుంట 37.7, KNR 37.6°Cగా నమోదైంది.
News March 13, 2025
కరీంనగర్: ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన: కలెక్టర్

గంగాధర మండలం గట్టుబుత్కూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటుక బట్టి కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది కార్మికుల పిల్లలతో ఒడియా, హిందీ భాషల్లో మాట్లాడారు. వారికి ఇస్తున్న ఆహారం, బోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోతరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంగ్లీష్ పాఠాలను బోధించారు.