News February 6, 2025
కరీంనగర్లో రేపు జాబ్ మేళా..!

కరీంనగర్లోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఆటానమస్)లో శుక్రవారం జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ప్రొ.డీ.వరలక్ష్మీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని.. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉండే ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ డ్రైవ్లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూకి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్ను వెంట తెచ్చుకోవాలన్నారు.
Similar News
News December 7, 2025
నల్గొండ: యాసంగికి నీటి విడుదల ఇలా..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్కు ఆన్, ఆఫ్ పద్ధతిలో సాగు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 80.74 టీఎంసీల విడుదల చేయనుండగా నల్గొండ చీఫ్ ఇంజినీర్ పరిధిలో 43.74 టీఎంసీలు, సూర్యాపేట ఇంజినీర్ పరిధిలో 40 టీఎంసీల అవసరం ఉంటుందని నిర్ధారించారు. 15 రోజులకోసారి ఆన్, ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల చేయనున్నారు. NLGలో 4,41,118, SRPTలో 4,74,041 ఎకరాలకు నీరు ఇవ్వనున్నారు.
News December 7, 2025
WGL: పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు పరీక్షే!

పంచాయతీ ఎన్నికలు MLAలకు పెద్ద పరీక్షలా మారింది. సరిగ్గా రెండేళ్ల అనంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజల మనోగతం ఈ ఎన్నికల ద్వారా వెల్లడి కానుంది. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ పార్టీ MLAలు గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ 11, ఒక్క స్థానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. పంచాయతీలను క్లీన్ స్వీప్ చేసి తమ సత్తా చాటుకొవాలని ఎమ్మెల్యేలందరూ గ్రామాల్లో తిరుగుతున్నారు.
News December 7, 2025
55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.


