News February 6, 2025
కరీంనగర్లో రేపు జాబ్ మేళా..!

కరీంనగర్లోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(ఆటానమస్)లో శుక్రవారం జాబ్ మేళా జరగనుందని ప్రిన్సిపల్ ప్రొ.డీ.వరలక్ష్మీ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని.. ఈ అవకాశాన్ని స్థానికంగా ఉండే ప్రతి నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ డ్రైవ్లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇంటర్వ్యూకి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్ను వెంట తెచ్చుకోవాలన్నారు.
Similar News
News March 26, 2025
వికారాబాద్: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: అ.కలెక్టర్

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2024-25 రబీ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్దతు ధర వరి ఏ-రకం ధాన్యానికి రూ.2320, సన్నాలకు రూ.500 బోనస్, మామూలు రకానికి రూ.2300 మద్దతు ధర నిర్ధారించడం జరిగిందన్నారు.
News March 26, 2025
కరిగిపోతున్న మంచు.. పెను ప్రమాదంలో చైనా?

చైనా మంచినీటి వనరులైన హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. 1960 నుంచి సుమారు 7వేలకు పైగా(సుమారు 26శాతం) మంచుదిబ్బలు మాయమైపోయాయని అంచనా. దీంతో తాగునీటి విషయంలో పెను సమస్యలు తప్పవని చైనా పర్యావరణవేత్తలు ఆందోళనగా ఉన్నారు. టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సుల్లో అత్యధికంగా హిమానీనదాలున్నాయి. వాటిని కాపాడేందుకు చైనా పలు మార్గాల్ని అన్వేషిస్తున్నా ఫలితం దక్కడం లేదు.
News March 26, 2025
భూపాలపల్లి: రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం: ఎస్పీ

రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ లోకండే బుధవారం జిల్లాలోని 19 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్లు, పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థుల మానసిక వికాసంలో పుస్తకాలు, క్రీడా సామగ్రి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.