News October 16, 2024
కరీంనగర్ అనే పేరు ఎలా వచ్చింది?
నేడు కరీంనగర్ అని పిలవబడే పేరు సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణం చేయబడింది. పూర్వం ఈ ప్రాంతానికి ‘సబ్బినాడు’ అని పేరు. KNR, శ్రీశైలంలలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరం.. కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున కరినగరం, క్రమంగా కరీంనగర్గా మారింది. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, సుప్రసిద్ధ కవులను తయారు చేసిన గడ్డ ఇది.
Similar News
News October 16, 2024
కరీంనగర్: పంచాయతీ ఎన్నికల బరిలో యువత!
ఇప్పటి వరకు రాజకీయాలంటే ఆసక్తి చూపని యువత ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 1,226 పంచాయతీల్లో ప్రధానంగా యువత బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతోంది. రోజూ గ్రామంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తూ.. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. మరి మీ దగ్గర యువత బరిలో ఉంటుందా? కామెంట్.
News October 16, 2024
KNR: కంప్యూటర్ ట్యాలీపై ఉచిత శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం
తిమ్మాపూర్లో గల SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో కంప్యూటర్ ట్యాలీపై ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 18 నుంచి 45సం.ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ శిక్షణ 30 రోజులు ఉంటుందన్నారు.
News October 16, 2024
రామగుండం MLA కుటుంబ సభ్యులతో మంత్రి సీతక్క విందు
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు & రామగుండం MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్-మనాలి ఠాకూర్ ఆహ్వానం మేరకు మంత్రి సీతక్క విందు భోజనం చేశారు. HYDలోని MLA నివాసానికి వచ్చిన మంత్రి సీతక్క కాసేపు రాజకీయ పరిణామాలు, అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం MLA కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి సరదాగా విందు భోజనం చేశారు.