News October 16, 2024
కరీంనగర్ అనే పేరు ఎలా వచ్చింది?

నేడు కరీంనగర్ అని పిలవబడే పేరు సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణం చేయబడింది. పూర్వం ఈ ప్రాంతానికి ‘సబ్బినాడు’ అని పేరు. KNR, శ్రీశైలంలలో దొరికిన, కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. కరినగరం.. కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున కరినగరం, క్రమంగా కరీంనగర్గా మారింది. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, సుప్రసిద్ధ కవులను తయారు చేసిన గడ్డ ఇది.
Similar News
News November 26, 2025
కరీంనగర్: NOV 28న RTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ

KNR- 2 డిపో నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో భద్రాచలం, పాపికొండల బోటింగ్, పర్ణశాల సందర్శనకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. NOV 28న కరీంనగర్ నుంచి బయలుదేరి తిరిగి NOV 29న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.1,800/-, పిల్లలకు రూ.1,300/-ల టికెట్ ధర నిర్ణయించామన్నారు. వివరాలకు 9398658062ను సంప్రదించాలన్నారు.
News November 26, 2025
కరీంనగర్ జిల్లాలో మొత్తం 2946 పోలింగ్ కేంద్రాలు

కరీంనగర్ జిల్లా: జిల్లాలోని మొత్తం 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు గాను 2,946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి విడత: 92 పంచాయతీలు, 866 వార్డులకు 866 పోలింగ్ కేంద్రాలు.
రెండవ విడత: 113 పంచాయతీలు, 1,046 వార్డులకు 1,046 పోలింగ్ కేంద్రాలు.
మూడవ విడత: 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 1,034 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.
News November 26, 2025
కరీంనగర్ జిల్లాలో మొత్తం 2946 పోలింగ్ కేంద్రాలు

కరీంనగర్ జిల్లా: జిల్లాలోని మొత్తం 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు గాను 2,946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి విడత: 92 పంచాయతీలు, 866 వార్డులకు 866 పోలింగ్ కేంద్రాలు.
రెండవ విడత: 113 పంచాయతీలు, 1,046 వార్డులకు 1,046 పోలింగ్ కేంద్రాలు.
మూడవ విడత: 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 1,034 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.


