News January 22, 2025
కరీంనగర్: ఆడపిల్లను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఆడపిల్లను ప్రోత్సహించాలని, బాలికను సమాజంలో ఎదగనివ్వాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బేటీ బచావో-బేటి పడావో కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్బస్టాండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలను రక్షించాలని ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News January 9, 2026
KNR: ‘ఉపాధి హామీకి కొత్త రూపం.. ‘వీబీ-జీ రామ్ జీ’గా బలోపేతం’

పాత ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని నీరుగార్చడం లేదని, దానికి మరిన్ని సంస్కరణలు అద్ది ‘వీబీ-జీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్) చట్టంగా కేంద్రం బలోపేతం చేసిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. కరీంనగర్లో జరిగిన బీజేపీ జిల్లా కార్యశాలలో ఆయన మాట్లాడుతూ, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు.
News January 9, 2026
KNR: స్కూళ్లలో ‘ఫిర్యాదుల పెట్టె’.. వేధింపులకు ఇక చెక్!

పాఠశాల విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేపట్టిన ‘ఫిర్యాదుల పెట్టె’ ఆలోచన ఆదర్శనీయంగా నిలుస్తోంది. బొమ్మకల్ హైస్కూల్లో ఈ పెట్టెను ఆమె స్వయంగా పరిశీలించారు. వేధింపులు, సమస్యలు ఎదురైతే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళా పోలీసుల పర్యవేక్షణలో వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. కలెక్టర్ అద్భుతమైన చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News January 9, 2026
రామడుగు కేజీబీవీలో కలెక్టర్ తనిఖీ

రామడుగు మండలం వెదిర కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, తరగతి గదులను తనిఖీ చేసిన ఆమె.. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుద్ధజలం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.


