News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News November 25, 2025

తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

image

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, ల్యూకోయిల్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.

News November 25, 2025

VJA: భవానీలకు ఉచిత బస్సులు.. వసతుల కల్పనకు చర్యలు.!

image

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీలు మాలవిరమణకు రానున్నారు. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. ఏర్పాట్లలో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి భక్తుల కోసం 17 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, క్లోరినేషన్, కేశఖండనశాలలో సిబ్బంది, ఉచిత ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News November 25, 2025

యాదాద్రీశుడి హుండీలో 20 దేశాల కరెన్సీ

image

యాదాద్రి శ్రీవారి దేవస్థానం హుండీ ఆదాయం సోమవారం లెక్కించారు. 20 దేశాల కరెన్సీ స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు EO వెంకట్రావు తెలిపారు. అమెరికా 2,014, ఆస్ట్రేలియా 75, ఇంగ్లండ్ 65, సౌదీ అరేబియా 61, ఒమన్ 2, మలేషియా 51, యూరో 15, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 970, కెనడా 1245, న్యూజిలాండ్ 95, శ్రీలంక 500, బహ్రెయిన్ 2, అరబ్ ఎమిరేట్స్ 70, సింగపూర్ 41, ఖతార్ 318, చైనా 20 తదితర దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.