News February 14, 2025
కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News March 27, 2025
డిల్లీ డీసీసీ ప్రెసిడెంట్స్ మీట్లో పాల్గొన్న కోమటిరెడ్డి

ఢిల్లీలోని ఇందిరాభవన్లో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే, KCవేణుగోపాల్ సమక్షంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో SUDAచైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీని బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తీసుకున్నారు
News March 27, 2025
కరీంనగర్: అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలపై సమావేశం

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి, బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ప్రజాసంఘాల నాయకులు, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో జిల్లాధికారులతో కరీంనగర్ కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 5న బాబు జగ్జీవన్ రావ్ జయంతి, 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News March 27, 2025
ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్లోనే ఏర్పాటు చేయాలి: ఏబీవీపీ

శాతవాహన యూనివర్సిటీకి నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాలలు మంజూరు కాగా.. ఇంజనీరింగ్ కలశాలను హుస్నాబాద్కు తరలిస్తూ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని ఏబీవీపీ నాయకులు శాతవాహన యూనివర్సిటీలో వీసీకి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ కళశాలను కరీంనగర్లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేష్, అజయ్, విష్ణు, అంజన్న, కిరణ్మయి, నందు ఉన్నారు.