News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News November 12, 2025

మంత్రి గారూ.. కురవి వీరన్నను దర్శించుకునేది ఎప్పుడో..!

image

MHBD జిల్లాలోని కురవి శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకమైనది. అయితే, జిల్లాలోనే ఉంటూ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కొండా సురేఖ మాత్రం ఇప్పటి వరకు వీరన్నను దర్శించుకోలేదు. దీంతో కోరిన వరాలనిచ్చే కొంగుబంగారమైన వీరన్నకు సైతం మేడారం తరహాలోనే నిధులు మంజూరు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, వీరన్నను మంత్రి దర్శించుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News November 12, 2025

ప్రభుత్వ వైఫల్యం వల్లే పేలుడు: ఖర్గే

image

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఢిల్లీ బ్లాస్ట్‌ జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. IB, CBI లాంటి ఏజెన్సీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విఫలమైంది. దర్యాప్తు నివేదిక వచ్చాక మేం మరింత మాట్లాడతాం’ అని తెలిపారు.

News November 12, 2025

నరసరావుపేట: ఎలుకల నివారణ గోడపత్రికల ఆవిష్కరణ

image

సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ భాగస్వాములై తమ పంటలను ఎలుకల బారినుంచి కాపాడుకోవాలని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధ్వర్యంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంపై గోడపత్రికలు ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా అందించిన బ్రోమోడయోలిన్‌ మందును నూనెతో కలిపిన నూకలను తీసుకొని విషపు ఎరను తయారు చేసుకోవాలని చెప్పారు.