News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News November 19, 2025

జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

image

ఈ నెల 14న జైనథ్‌లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్‌కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

News November 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 19, 2025

AIని గుడ్డిగా నమ్మవద్దు: సుందర్ పిచాయ్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మవద్దని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. AI కూడా తప్పులు చేసే అవకాశం ఉందని, ఇతర టూల్స్‌లో సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని చెప్పారు. విభిన్న మాధ్యమాలతో కూడిన సమాచార వ్యవస్థ ఉండటం ముఖ్యమని తెలిపారు. ఏఐ పెట్టుబడుల ‘బబుల్’ ఏ దశలోనైనా విస్ఫోటనం చెందవచ్చని, ఈ విషయంలో కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని BBC ఇంటర్వ్యూలో సూచించారు.