News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News November 15, 2025

ఈషాసింగ్‌కు CM రేవంత్ అభినందనలు

image

TG: కైరో(EGYPT)లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి ఈషాసింగ్‌కు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. షూటింగ్‌లో పట్టుదలతో సాధన చేస్తూ ఈషాసింగ్‌ ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలి’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు CMO ట్వీట్ చేసింది.

News November 15, 2025

జగిత్యాల: విద్యార్థులకు అందుబాటులో హాల్‌టికెట్స్

image

నేషనల్ మెయిన్స్-కం-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష-2025 నిర్వహణకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్లను bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ రాము తెలిపారు.జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలలోని 6 కేంద్రాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు సమయానికి ముందే గుర్తింపు పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.

News November 15, 2025

కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర సమీక్ష సమావేశం

image

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం, జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కే.హైమావతి అధ్యక్షుతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం కొమురవెల్లిలో తేదీ 14 డిసెంబర్ 2025 ఆదివారం రోజున ఉదయం 10:45 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం,18 జనవరి నుంచి 16 మార్చ్ 2026 వరకు ప్రతి ఆదివారం ఉంటుందన్నారు.