News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News October 17, 2025

కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్

image

2025-26 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో రాజస్వ మండలాధికారి లోకేశ్వర్ రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 44 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్నారు.

News October 17, 2025

సమస్యలుంటే పోలీసులకు తెలియజేయండి: ఏఎస్పీ

image

ఏలూరు జిల్లాలో శక్తి యాప్‌పై అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ఆలయాల వద్ద శక్తి టీమ్ నిత్యం గస్తీ నిర్వహిస్తుందని ఏఎస్పీ తెలిపారు. ఆకతాయిల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.

News October 17, 2025

తెనాలి: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

image

తెనాలి చెంచుపేటలో మంగళవారం జరిగిన జుటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుడు గండికోట వెంకట సుబ్బారావును త్రీ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడు, నిందితుడి స్వగ్రామమైన కోడితాడిపర్రులో నెలకొన్న చిన్న వివాదాలే హత్యకు దారితీశాయని డీఎస్పీ జనార్ధనరావు, సీఐ సాంబశివరావు తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.