News February 14, 2025
కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News December 1, 2025
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు: పోలీస్ కమిషనర్

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ను పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో ఉంటాయని, గస్తీ, పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తున్నారని ఆయన తెలిపారు.
News December 1, 2025
తగ్గుతున్న GST ఆదాయ వృద్ధి!

TG: రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. NOVలో ₹3910 కోట్ల GST వసూలైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024 NOVలో వచ్చిన ₹3880 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1% పెరిగింది. అయితే అయితే ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే నెలనెలా పెరగాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. GST-2.O అమలు చేసినప్పటి తరువాత నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.
News December 1, 2025
నిపుణులతో తరగతుల నిర్వహణ: దీపక్ తివారి

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నిపుణుల ద్వారా తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ జిల్లా విద్యాధికారి దీపక్ తివారి సూచించారు. సోమవారం ASF జిల్లా కలెక్టరేట్లో పీఎం శ్రీ పాఠశాలల హెచ్ఎమ్లతో సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.


