News February 14, 2025

కరీంనగర్: ఆ ఘటనకు 11 ఏళ్లు..

image

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.

Similar News

News December 8, 2025

కడప: ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించారని ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కడప కలెక్టర్‌లో జరిగిన రివ్యూ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందులో భాగంగా కడప కార్పోరేషన్ సరోజినీ నగర్ వార్డు సెక్రటరీ, సింహాద్రిపురం తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెన్షన్ చేశారు. సింహాద్రిపురం డీటీ, కడప విలేజ్ సర్వేయర్‌కు మెమోలు ఇచ్చారు.

News December 8, 2025

క్రిప్టో సంస్థలపై కేంద్రం చర్యలు.. ఎంపీ మహేష్ వెల్లడి

image

పన్ను చెల్లించని క్రిప్టో కరెన్సీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాల వారీగా క్రిప్టో సంస్థల నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలు కోరుతూ ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. 2024-25 ఏడాదిలో వసూలు చేసిన లెక్కల ప్రకారం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు మొదటి 2స్థానాల్లో ఉండగా, AP 10వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.

News December 8, 2025

భద్రాచలం: పట్టుబడిన సుమారు రూ.కోటి నిషేధిత గంజాయి

image

కూనవరం రోడ్లో ఎస్ఐ సతీష్ నిర్వహించిన వాహన తనిఖీల్లో 222.966 కేజీల గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కూనవరం నుంచి భద్రాచలం వైపుగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేధిత 110 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.1,11,48,300 ఉంటుందని చెప్పారు. బుచ్చయ్య, రమేష్, షేక్ షఫివుద్దిన్, మహమ్మద్ మోసిన్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.