News March 17, 2025

కరీంనగర్: ఇంటర్ పరీక్షల్లో 621 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పెపర్ 1 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 19,425 మంది విద్యార్థులకు గాను 18,804 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 621 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 18, 2025

ఇల్లందకుంట: GREAT.. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్

image

నిన్న విడుదలైన గ్రేడ్-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇల్లందకుంట మండలం సిరిసేడుకి చెందిన బీనవేని పరుశురాం ఎంపికయ్యాడు. రాష్ట్ర స్థాయిలో 35వ ర్యాంక్ సాధించి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పరుశురాముది పేద రైతు కుటుంబం. అయినప్పటికీ కష్టపడి చదివి 2023 పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం పరుశురాం కేయూలో PHD చేస్తున్నాడు.

News March 18, 2025

KNR: ఇంటి వద్దకే రాములు వారి తలంబ్రాలు: ఆర్టీసీ RM

image

భద్రాచలంలో ఏప్రిల్ 6న శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని పురస్కరించుకొని అక్కడకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామని RM బి.రాజు తెలిపారు. ఇందుకు గాను ఒక్కొక్క ప్యాకెట్ కు రూ.151 ఆన్లైన్ లేదా అన్ని బస్టాండ్ కార్గో సెంటర్లు, ఏజెంట్ కౌంటర్ల వద్ద గాని బుక్ చేసుకోవచ్చని చెప్పారు.

News March 18, 2025

KNR: వలస కార్మికుల పిల్లల చదువును ప్రోత్సహిస్తాం: కలెక్టర్

image

వలస కార్మికుల పిల్లల చదువులు ప్రోత్సహిస్తామని, ఇందుకోసం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వలస కూలీల కార్మికుల యజమానులు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎం.ఈ.ఓలు, ఇటుక బట్టీల యజమానులు పాల్గొన్నారు.

error: Content is protected !!