News February 18, 2025

కరీంనగర్: ఈనెల 25 నుంచి ఫార్మసీ పరీక్షలు

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) ఏడు, ఎనిమిది సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఎన్‌వీ.శ్రీరంగ ప్రసాద్ తెలియజేశారు. ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. 

Similar News

News February 23, 2026

జనుము, అలసందతో భూమికి కలిగే మేలు

image

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.

News February 23, 2026

భారత్ బ్యాడ్ రికార్డ్

image

T20WC సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో 76 రన్స్ తేడాతో <<19212972>>ఓడిపోయిన<<>> భారత్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. T20 వరల్డ్ కప్‌లలో పరుగుల పరంగా టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. 2010లో 49 రన్స్(vs AUS), 2016లో 47 పరుగుల(vs NZ) తేడాతో పరాజయం పాలైంది. అలాగే 2019 తర్వాత T20Iలలో ఇది రెండో బిగ్గెస్ట్ ఓటమి. చివరిసారిగా న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.

News February 23, 2026

మంగళగిరి: తలకొరివిపెట్టి రుణం తీర్చుకున్న మనవరాలు

image

కన్నకొడుకు లేకపోయినా, అల్లారుముద్దుగా పెంచిన నాయనమ్మకు మనవరాలే అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన యర్రబాలెంలో జరిగింది. గుంటూరుకు చెందిన పాశం లక్ష్మమ్మ(88) తన కుమారుడు మరణించడంతో యర్రబాలెంలోని మనవరాలు సునీత వద్ద ఉంటోంది. ఆదివారం లక్ష్మమ్మ వృద్ధాప్యంతో మృతి చెందగా, సునీత తన భర్త నాగరాజు అంగీకారంతో నాయనమ్మకు తలకొరివి పెట్టింది. ఆచారాల కంటే ఆప్యాయతే మిన్న అని నిరూపించిన సునీతను స్థానికులు అభినందించారు.