News February 18, 2025

కరీంనగర్: ఈనెల 25 నుంచి ఫార్మసీ పరీక్షలు

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) ఏడు, ఎనిమిది సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమవనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఎన్‌వీ.శ్రీరంగ ప్రసాద్ తెలియజేశారు. ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవనున్నట్లు వెల్లడించారు. 

Similar News

News November 17, 2025

సిద్దపేట: ప్రతి శనివారం సీపీతో ‘ఫోన్-ఇన్’

image

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శనివారం ‘పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సమస్యలు, ముఖ్యమైన అంశాలపై నేరుగా కమిషనర్‌తో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.

News November 17, 2025

హనుమకొండ: కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో దాస్యం భేటీ

image

కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ భేటీ అయ్యారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు ముచ్చటించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేతలు పులి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

News November 17, 2025

EVM గోడౌన్‌ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

EVM గోడౌన్ వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.