News March 14, 2025

కరీంనగర్: ఈవీఎం గోదాంను పరిశీలించిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌లను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాడ్ గోడౌన్‌లను తనిఖీ చేస్తున్నామని, ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి గోడౌన్ తనిఖీ చేశారు.

Similar News

News September 18, 2025

‘కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అప్పులపాలు చేసింది’

image

తెలంగాణను KCR కుటుంబం అప్పుల పాలు చేసిందని PCC ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం మండిపడ్డారు. KNRలోని R&B గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో హరీశ్‌రావు అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించగా, KCR సూత్రధారి అని హరీశ్‌రావు విచారణలో చెప్పారని అన్నారు. నయీం ఆస్తులను KCR తన ఖజానాలో జమచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని గజ్జల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు.

News September 18, 2025

KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

image

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.

News September 18, 2025

KNR: చేతిరాత చాలా ముఖ్యమైంది: కలెక్టర్

image

కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం రాత్రి జిల్లా స్థాయి చేతిరాత విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి హాజరై మాట్లాడారు. హ్యాండ్ రైటింగ్ జీవితంలో చాలా ముఖ్యమైందని, దీనిని ఇంప్రూవ్ చేసుకోవాలని సూచించారు. చేతిరాత అంటే మైండ్ రైటింగ్ అని, మేధస్సుకు పదును పెట్టి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.