News February 11, 2025

కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.

Similar News

News November 18, 2025

AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి కన్నుమూత

image

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. కాగా, ఆయన ఏడాదిగా క్యాన్సర్‌తో పోరాడారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక సురేందర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితులై తన జీవితకాలం మొత్తం AIFBలోనే కొనసాగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు.

News November 18, 2025

AIFB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి కన్నుమూత

image

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. కాగా, ఆయన ఏడాదిగా క్యాన్సర్‌తో పోరాడారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇక సురేందర్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు ఆకర్షితులై తన జీవితకాలం మొత్తం AIFBలోనే కొనసాగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమించారు.

News November 18, 2025

మదనపల్లె: తల్లిని చంపిన కుమారుడు..?

image

మదనపల్లె CTM క్రాస్ వద్ద సావిత్రమ్మ <<18308405>>హత్యకు <<>>గురైన విషయం తెలిసిందే. ఆమె భర్త ఐదేళ్ల కిందట చనిపోగా కుమారుడు ఆదిత్యతో కలిసి ఉంటున్నారు. నెల కిందట ఆదిత్య బైక్ కొన్నాడు. డబ్బులు లేనప్పుడు బైక్ ఎందుకని తల్లి తిరిగి షోరూములో ఇచ్చేశారు. దీంతో తల్లితో గొడవ పడి ఆదిత్య తన భార్యతో మదనపల్లెలో కాపురం పెట్టాడు. హత్య తర్వాత కుమారుడి ఫోన్ స్విచ్ఛాప్, అతని ఇంటికి తాళం వేయడంతో అతనే చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.