News February 11, 2025
కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.
Similar News
News November 20, 2025
HNK: సాదారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: కలెక్టర్

ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను పెంచాలని, సిజేరియన్లను తగ్గించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
12 వారాలలోపు ప్రతి గర్భిణీ వివరాలను ఏఎన్ఎం లు నమోదు చేయాలన్నారు. గర్భిణీలకు తప్పనిసరిగా నాలుగుసార్లు చెకప్ కు వచ్చేలా ఏఎన్ఎంలు, ఆశాలు కృషి చేయాలన్నారు.
News November 20, 2025
HNK: ‘బాలల హక్కుల పరిరక్షణకు సమన్వయం అవసరం’

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలలు దేశ సంపద అని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి, వారిని అభినందించి బహుమతులు అందించారు.
News November 20, 2025
MHBD: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే: డీఎంహెచ్వో

మహబూబాబాద్ జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో డీఎంహెచ్వో (DMHO) రవి రాథోడ్ పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి ఉంటేనే చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల వారు ప్రతి నెల 5వ తేదీలోపు ఫామ్-ఎఫ్లను ఆరోగ్యశాఖ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని డీఎంహెచ్వో స్పష్టం చేశారు.


