News February 11, 2025

కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.

Similar News

News October 23, 2025

MHBD: 1800 దరఖాస్తులు.. రూ.54 కోట్లు ఆదాయం

image

జిల్లాలో 61 మద్యం షాపులకు 1800 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ ఎస్పీ కిరణ్ తెలిపారు. MHBD 667, తొర్రూర్ 769, గూడూరు 364 స్టేషన్ల వారీగా 1800 దరఖాస్తులు వచ్చాయి. 2023 సంవత్సరంలో మొత్తం 2,589 దరఖాస్తులకు 51.78 కోట్లు, 2025లో మొత్తం 1800 దరఖాస్తులకు రూ.3 లక్షల చొప్పున రూ.54 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలో ఈ 27 తేదీన లక్కీ డ్రా ఉంటుందన్నారు.

News October 23, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

◈తాడేపల్లి ప్యాలెస్ నుంచి కల్తీ మద్యం సరఫరా: ఎమ్మెల్యే మామిడి
◈ టెక్కలి: నందెన్న ఊరేగింపులో ఘర్షణ..ఇద్దరిపై కేసు నమోదు
◈ మందస: చాపరాయి భూ సమస్యపై న్యాయం చేయాలి
◈అధ్వానంగా సరుబుజ్జిలి, కొత్తూరు ప్రధాన రహదారులు
◈ శ్రీకాకుళం: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
◈ సింధూర జలసిరిపై పలాస ఎమ్మెల్యే శిరీష సమీక్ష
◈ఎల్.ఎన్ పేట: శవ దహనానికి సవాలక్ష పాట్లు
◈ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న

News October 23, 2025

కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదే: బల్దియా కమిషనర్

image

నగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ నిర్వహణ బల్దియాదేనని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన అన్ని కమ్యూనిటీ హాల్‌లను వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇకపై బల్దియా అధికారులే నిర్వహణ చేయాలని కమిషనర్ సూచించారు.