News February 15, 2025

కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News December 23, 2025

రన్నింగ్ VS వాకింగ్.. ఎవరికి ఏది మేలు?

image

వాకింగ్ కంటే రన్నింగ్ ఎక్కువ మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ‘పరిగెత్తడం వల్ల కీళ్లు దెబ్బతింటాయనేది అపోహ. హెల్తీగా ఉన్నవాళ్లు వారానికి 5 రోజులు 45ని.లు పరిగెత్తితే గుండె సామర్థ్యం, మెదడు పనితీరు మెరుగవుతుంది. నడకతో పోలిస్తే పరుగు తక్కువ సమయంలో ఎక్కువ జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రారంభ దశలో ఉన్నవారికి నడక, శారీరక సామర్థ్యం ఉన్నవారు రన్నింగ్ చేయడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు. SHARE IT

News December 23, 2025

దళారుల చేతుల్లో మోసపోవద్దు: సమగ్ర శిక్ష SPD

image

AP: ఒకేషనల్ ట్రైనర్ల నియామకంలో దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని సమగ్ర శిక్ష SPD శ్రీనివాసరావు తెలిపారు. ‘ఒకేషనల్ ట్రైనర్ల నియామకాల్ని థర్డ్ పార్టీ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇవి పూర్తిగా ఒకేషనల్ ట్రైనింగ్ పార్ట్‌నర్స్ నిర్వహణలో, పరిమితకాలమే ఉంటాయి. దళారులకు డబ్బులిచ్చి మోసపోతే సమగ్ర శిక్షకు సంబంధం లేదు. ట్రైనింగ్ పార్ట్‌నర్లు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.

News December 23, 2025

పార్వతీపురం: ‘మార్పు ఒక్క దగ్గర ఆగదు’

image

మార్పు ఒక్క దగ్గర ఆగదని.. మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుందని పార్వతీపురం మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అందరం సమన్వయంతో ముందుకెళ్తే ఫలితాలు తథ్యమని ఆయన స్పష్టం చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి వర్క్ షాపు నిర్వహించారు. లక్ష్యం పెద్దదైనప్పుడు దానికి తగ్గ ప్రణాళిక కూడా పక్కాగా ఉండాలని, అపుడే అభివృద్ధి సామాన్యుడి దరికి చేరుతుందన్నారు.