News February 14, 2025
కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకుల నియామకం

MDK-NZB -KNR-ADB పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిశీలకులు సంజయ్ కుమార్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలకులు మహేశ్ దత్ 7993744287లను సంప్రదించాలన్నారు.
Similar News
News November 16, 2025
ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా

అదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బజార్హత్నూర్ 8.4°C, పొచ్చర 9, సత్నాల 9.5, సోనాల 9.6, పిప్పల్ దారి 9.8, అర్లి(T) 9.9, ఆదిలాబాద్ అర్బన్ 10.1, తలమడుగు 10.3, రామ్ నగర్ 10.4, భరంపూర్ 10.7, తాంసి 10.8, గుడిహత్నూర్ 11.3, హీరాపూర్ 11.4, సిరికొండ 11.6, ఇచ్చోడ, ఉట్నూర్(X రోడ్) 12.4°C లుగా నమోదయ్యాయి.
News November 16, 2025
తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 16, 2025
పింగిళి కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

HNK వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ- పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి. చంద్రమౌళి తెలిపారు. ఎంఏ (తెలుగు, ఇంగ్లీష్), ఎమ్మెస్సీ (జువాలజీ, బాటనీ, కంప్యూటర్ సైన్స్) వంటి కోర్సులకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు. సీపీజీఈటీ-2025 అర్హత తప్పనిసరి అని చెప్పారు.


