News February 25, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి?

Similar News

News December 20, 2025

ASF: పంచాయతీ పోరులో సగం.. సత్తా చాటిన మహిళలు

image

ASF జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. వారికి కేటాయించిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీపడ్డారు. జిల్లాలో 332 గ్రామ పంచాయతీలలో జరిగిన ఎన్నికల్లో 170 మంది మహిళ సర్పంచ్లు గెలుపొందారు. మొదటి విడతలో 60 మంది, 2వ విడతలో 54, 3వ విడతలో 56 మహిళలు ఎన్నికయ్యారు.

News December 20, 2025

కామారెడ్డి: లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలి

image

కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, బీడీ కార్మికులు, ఇతర కంపెనీల్లో పనిచేసి పదవి విరమణ పొంది పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లు ఈ నెలాఖరులోగా అందజేయాలని ఉమ్మడి జిల్లా ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్లు అందజేయనివారు మీసేవా కేంద్రాల్లో అందజేయాలన్నారు.

News December 20, 2025

కొండంత లక్ష్యం.. ఎదురొడ్డుతున్న ఇంగ్లండ్

image

యాషెస్ మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. కొండంత లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు ఆదిలోనే ఓపెనర్ డకెట్(4) వికెట్ కోల్పోయింది. తర్వాత పోప్(17) కూడా ఔట్ అయ్యారు. దీంతో ఆ జట్టు 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో క్రాలే, రూట్ ఉన్నారు. ఆట ఇవాళ, రేపు మిగిలి ఉండగా ENG టార్గెట్‌ను ఛేదించడం గగనమే.