News February 25, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోరు

image

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి మధ్యనే పోటీ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి?

Similar News

News December 13, 2025

22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

image

TG స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ సెట్) పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టీజీ సెట్‌ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.

News December 13, 2025

BHPL: ఎన్నికల ఖర్చులు.. లెక్క చెప్పాల్సిందే!

image

జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడిన గెలిచిన ప్రచారం కోసం పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్‌కు చెప్పాలి. ఏ విడత ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసిన రోజు వరకు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో ప్రతి ఒక్క అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే.

News December 13, 2025

కోనసీమ ‘రాజ’సం.. మన రాజుగారు

image

కోనసీమ మట్టి పరిమళం, కళాత్మక విలువల మేళవింపు డీవీఎస్ రాజు. అల్లవరం గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రభావితం చేసిన ఆ ‘సినీ భీష్ముడి’ జయంతి నేడు. ఆయన తండ్రి డి.బలరామరాజు నరసాపురం ఎంపీగా ప్రజాసేవలో ఉంటే, తనయుడు డీవీఎస్ రాజు కళామతల్లి సేవలో తరించారు. కేవలం నిర్మాతగానే కాకుండా, జాతీయ స్థాయిలో NFDC ఛైర్మన్‌గా తెలుగు వారి కీర్తిని దశదిశలా చాటి దార్శనికుడిగా నిలిచారు.