News February 27, 2025

కరీంనగర్: ఎమ్మెల్సీ ఓటు వేసేందుకు ప్రత్యేక సెలవు: కలెక్టర్

image

గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదీత ఓటర్లుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక సెలవు వర్తిస్తుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థ, ఇతర అన్ని ప్రైవేటు మేనేజ్మెంట్లు లలో పనిచేస్తు ఓటు హక్కు ఉన్న ఉద్యోగు ఓటు వేసేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాలని తెలిపారు.

Similar News

News February 27, 2025

HZB: ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సస్పెన్షన్

image

హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆస్పత్రిలకు పంపిస్తున్నారని ఆరోపణల మేర వారం రోజుల క్రితం విచారణ జరిపి డీఎంహెచ్‌వో వెంకట రమణ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి తెలిపారు.

News February 27, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

image

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.0°C నమోదు కాగా, ఈదులగట్టేపల్లి 37.4, నుస్తులాపూర్ 37.1, తాంగుల, పోచంపల్లి 36.3, గంగిపల్లి, గట్టుదుద్దెనపల్లె 35.9, జమ్మికుంట 35.7, అర్నకొండ 35.6, కరీంనగర్ 35.5, తాడికల్, దుర్శేడ్, కొత్తపల్లి-ధర్మారం 35.4, కొత్తగట్టు 35.1, గంగాధర 34.9, గుండి 34.8, వీణవంక 34.6, ఇందుర్తి 34.5, వెదురుగట్టు 34.2°Cగా నమోదైంది.

News February 27, 2025

కరీంనగర్: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న KNR, MDK, ADB, NZB పట్టభద్రుల, టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పట్టభద్రులు 71,545, ఉఫాధ్యాయులు 4,035 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం 85, ఉపాధ్యాయుల కోసం 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ స్థానంలో 15 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

error: Content is protected !!