News April 10, 2025

కరీంనగర్: కూతురిని చంపి తల్లి సూసైడ్

image

పెద్దపలి టీచర్స్ కాలనీలో <<16048255>>కూతురిని <<>>చంపి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. జూలపల్లి వాసి వేణుగోపాల్ రెడ్డితో KNR జిల్లా రామడుగు(M) వెదిరకు చెందిన సాహితి(26)కి పెళ్లైంది. రాత్రి వేణుగోపాల్ ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్యను చంపి భార్య ఉరేసుకుని కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 26, 2025

మహిళల ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయోటిక్స్

image

ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా పలుఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో యూరినరీట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయంటున్నారు నిపుణులు. అలాగే పేగులోని అసమతుల్యతను సరిచేసి చర్మసమస్యలు తగ్గించడంలో, మూడ్ స్వింగ్స్, వెయిట్ మేనేజ్‌మెంట్‌లోనూ సాయపడతాయి. వీటికోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోసె, అరటి,యాపిల్​, ఉల్లి, వెల్లుల్లి తీసుకోవాలని సూచిస్తున్నారు.

News October 26, 2025

దిలావర్‌పూర్‌లో అత్యధికం

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 250.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా దిలావర్‌పూర్ మండలంలో 62.2 మి.మీ., సారంగాపూర్‌లో 51.2 మి.మీ. వర్షం కురిసింది. రాబోయే 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 26, 2025

కొమురం భీమ్‌ గురించి తెలుసుకోండి: మోదీ

image

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై PM మోదీ ప్రశంసలు కురిపించారు. ‘బ్రిటిషర్ల దోపిడీ, నిజాం దురాగతాలు పెరిగిపోయిన సమయంలో 20 ఏళ్ల యువకుడు ఎదురు నిలబడ్డాడు. తన పోరాటంలో నిజాం అధికారిని చంపి, అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. నేను మాట్లాడేది కొమురం భీమ్ గురించే. ఈ నెల 22న ఆయన జయంతి జరిగింది. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన గురించి యువత తెలుసుకోవాలి’ అని మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.