News April 5, 2024
కరీంనగర్: కేసీఆర్ నేటి పర్యటన వివరాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు ముకుదమ్పుర్ గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయిన్పల్లి, చొప్పదండి మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. 3 గంటలకు శభాష్పల్లిలో మిడ్ మానేరును సందర్శిస్తారు. 4 గంటలకు సిరిసిల్లలో ప్రెస్ మీట్లో పాల్గొంటారు.
Similar News
News December 18, 2025
ఒక్క ఓటుతో శ్రీరాములపల్లి సర్పంచ్గా రమ్య

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుత్తికొండ రమ్య ఒక్క ఓటుతో విజయం సాధించారు. తన ప్రత్యర్థి BRS అభ్యర్థి తిప్పరబోయిన శారదపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. రీకౌంటింగ్ జరిగినా ఒక ఓటు తేడా ఉండడంతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
News December 17, 2025
కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి

ముడో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయిన తరువాత కౌటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. జమ్మికుంట మండలం మాచనపల్లి, జగ్గయ్య పల్లె గ్రామంలో కౌటింగ్ ప్రక్రియను పరిశీలించినారు. అనంతరం వీణవంక మండలం రెడ్డిపల్లి, చల్లూర్, మామిడాలపల్లెలోనూ కౌటింగ్ విధానంను పర్యవేక్షించి ఈ మేరకు అధికార్లకు పలు సూచనలు చేశారు.
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.


