News May 20, 2024

కరీంనగర్: కొత్త రేషన్ కార్డులపై ఆశలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1947 రేషన్ షాపులు ఉండగా 9,80,261 ఆహారభద్రత కార్డులు ఉండగా 28,24,897 మంది కుటుంబ సభ్యులు రాయితీతో కూడిన లబ్ధి పొందుతున్నారు.

Similar News

News November 19, 2025

JMKT: ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు.. రేపు మార్కెట్‌కు సెలవు

image

జమ్మికుంట మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నాలుగు రోజుల విరామం తర్వాత బుధవారం ప్రారంభం కాగా ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌కు రైతులు 351 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,090, కనిష్ఠంగా రూ.6,000 ధర పలికింది. అలాగే గోనె సంచుల్లో వచ్చిన 14 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,600 ధర లభించింది. గురువారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.

News November 19, 2025

జమ్మికుంటలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

పత్తి కొనుగోళ్లలో సీసీఐ (CCI) అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై ఈ నెల 17 నుంచి నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జమ్మికుంట మార్కెట్‌లో నేటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుందని మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న తెలిపారు.

News November 19, 2025

జమ్మికుంటలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

పత్తి కొనుగోళ్లలో సీసీఐ (CCI) అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై ఈ నెల 17 నుంచి నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జమ్మికుంట మార్కెట్‌లో నేటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుందని మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న తెలిపారు.