News February 24, 2025

కరీంనగర్: గం‘జాయ్‌’లో యువత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల రామగుండంలో 60 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదు చేసి 48మందిని అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ధర్మపురి మండలం మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేయడంతో అరెస్టు చేశారు.

Similar News

News October 17, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం (D)కి చెందిన వినయ్ పురుషోత్తపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వినయ్ తన మిత్రుడు ఉదయ్‌తో తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్‌ చికిత్స్ పొందుతున్నాడు.

News October 17, 2025

విజయవాడ: నైపుణ్య కోర్సులలో యువతకు ఫ్రీ కోచింగ్

image

నున్నలోని సీడాప్ శిక్షణ కేంద్రంలో హోటల్ మేనేజ్‌మెంట్‌, టాలీ, టెక్నిషియన్, సాఫ్ట్ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శిక్షణ అధికారి ధనలక్ష్మి తెలిపారు. SSC ఆపైన చదివి 18- 30 ఏళ్లలోపువారు ఈ శిక్షణలో చేరవచ్చని..ఉచిత హాస్టల్, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని..వివరాలకు 8142602179 నెంబరులో సంప్రదించాలని ఆమె సూచించారు.

News October 17, 2025

హెల్మెట్ వాడకం తప్పనిసరి: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్

image

ప్రపంచ ట్రామా డే సందర్భంగా ఏలూరులోని ఆశ్రమం ఆసుపత్రిలో శుక్రవారం హెల్మెట్‌ వాడకంపై ప్రత్యేక ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణాపాయానికి ముఖ్య కారణం హెల్మెట్‌ ధరించకపోవడమేనని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్‌ వాడాలని ఆయన కోరారు.