News March 6, 2025
కరీంనగర్: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీలు నేతలంటున్నారు.
Similar News
News December 16, 2025
BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

U-19 ఆసియా కప్లో భాగంగా మలేషియాతో మ్యాచ్లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.
News December 16, 2025
జోజినగర్ స్థలం కబ్జాలో టీడీపీ నేతల పాత్ర: వైఎస్ జగన్

విజయవాడ భవానిపురంలోని జోజినగర్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని టీడీపీ నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 2016లో రమా సొసైటీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, 25 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం దారుణమని జగన్ అన్నారు.
News December 16, 2025
GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.


