News March 6, 2025
కరీంనగర్: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీలు నేతలంటున్నారు.
Similar News
News November 27, 2025
KMR: జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల జాతర!

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇయాల్టి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఎన్నికల మొదటి విడతలో భాగంగా, జిల్లాలోని 167 గ్రామ పంచాయతీలు (1520 వార్డులకు) ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రోజు నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ఎంత ఉత్సాహం చూపిస్తారో, ఎంత మంది నామినేషన్ వేస్తారో అనేది చూడాలి. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
జిల్లాలో నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు కొనసాగనుంది. వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని 85 సర్పంచ్ స్థానాలు, 748 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 27, 2025
జనగామ: నేడు మొదటి విడత జీపీ ఎన్నికల నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లను ఈరోజు ఉ.10 నుంచి సా.5 గం.ల వరకు అధికారులు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జనగామ జిల్లాలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, జఫర్గడ్ మండలంలోని 110 గ్రామపంచాయతీలు, 1024 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


