News October 7, 2024
కరీంనగర్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. కాగా జగిత్యాలలో 382 గ్రామ పంచాయతీలు అలాగే సిరిసిల్ల-255, కరీంనగర్-323, పెద్దపల్లి జిల్లాలో 266 పంచాయతీలు ఉన్నాయి.
Similar News
News December 11, 2025
గంగాధర: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

గంగాధర మండలంలోని కూరిక్యాల, గంగాధర సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటు ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరును, ఓటింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఎంపీడీవో డి.రాము, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
News December 11, 2025
కరీంనగర్: ఆ రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి- కలెక్టర్

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు 3-దఫాలుగా 2వ ఆర్డినరీ ఎలక్షన్స్ నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రకటించారు. మీ సంస్థలలో పనిచేసే కార్మికులకు 11, 14& 17 తేదీలలో (సంబంధిత మండలాలలో పోలింగ్ రోజున) వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులందరికి తెలియజేశారు. ఈ సెలవును దుకాణాలు, సంస్థల చట్టం 1988, సెక్షన్ 13 ప్రకారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
News December 11, 2025
కరీంనగర్: 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 46.39% పోలింగ్ నమోదైంది. చొప్పదండిలో అత్యధికంగా 53.98% పోలింగ్ జరగ్గా, కరీంనగర్ రూరల్లో 49.64%, గంగాధరలో 45.16%, కొత్తపల్లిలో 46.19%, రామడుగులో 40.83% చొప్పున ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలలో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.


