News December 14, 2024
కరీంనగర్: గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్న ఈ పరీక్షలకు 26,977 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 56 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరిక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
Similar News
News October 30, 2025
శంకరపట్నం: తల్లికొడుకులపై గొడ్డలితో దాడి.. హత్యాయత్నం

శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో తల్లికొడుకులపై గొడ్డలితో దాడి జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం రాజు, గడ్డం మల్లవ్వపై చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన వారి బంధువులు హత్యా ప్రయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 30, 2025
KNR: మొంథా తుఫాన్.. రైతన్నలకు మిగిల్చింది తడిసిన ధాన్యమే

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అధికారుల అంచనా ప్రకారం 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో తడిసి ముద్దయినట్లు సమాచారం. చేతికి వచ్చిన పంట అమ్ముకునే సమయంలో వర్షాలు పడి పంట నష్టాన్ని కలిగించిందన రైతులు వాపోయారు. రైతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించే సాయమే మిగిలిందని రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
News October 29, 2025
KNRలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సెలవు ప్రకటిస్తూ విద్యాధికారులకు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందుబాటులో ఉండాలని సూచించారు.


