News February 1, 2025
కరీంనగర్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్
కరీంనగర్లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్ త్రో ఫైనల్స్లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.
Similar News
News February 1, 2025
వరంగల్: ఆపరేషన్ స్మైల్ ద్వారా 161 చిన్నారులకు విముక్తి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ఝా తెలిపారు. వీరిలో 137 మంది బాలలు, 24 మంది బాలికలు ఉన్నారన్నారు. తనిఖీల్లో గుర్తించిన చిన్నారులను బాలల సంరక్షణ గృహానికి తరలించామని సీపీ తెలిపారు.
News February 1, 2025
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా RP ఠాకూర్
AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ RP ఠాకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా ఈయన పని చేయనున్నారు. RP ఠాకూర్ 2018 నుంచి 2019 వరకు ఏపీ డీజీపీగా పనిచేశారు. కొంత కాలం ఆర్టీసీ ఎండీగా కూడా సేవలందించారు.
News February 1, 2025
కథలాపూర్: తపాలా జీవిత పథకం ప్రవేశపెట్టి 141 ఏళ్లు
తపాలా శాఖ ఆధ్వర్యంలో తపాలా జీవిత బీమా పథకం ప్రవేశపెట్టి ఫిబ్రవరి 1 నాటికి 141 ఏళ్లు పూర్తయిందని తపాలా శాఖ ఉమ్మడి కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని తపాలా శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తపాలా బీమా పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట సబ్ పోస్ట్ మాస్టర్ జయరాం ఉన్నారు.