News August 8, 2024
కరీంనగర్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆర్ఎంపీ వైద్యం వికటించి చికిత్స పోందుతున్న శంకరపట్నం మండలం మెట్పల్లికి చెందిన ముంజ లక్ష్మయ్య మరణించినట్లు కేశవపట్నం ఎస్సై రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. లక్ష్మయ్యకు విరేచనాలు అవుతుండటంతో ఆర్ఎంపీ మధు దగ్గరకు తీసుకెళ్లగా.. వైద్యం వికటించి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు HNKలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.
Similar News
News October 8, 2024
పెద్దపల్లి: రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేసిన ఎంపీ
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, రెచ్నిలలో కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి కోసం నేడు పెద్దపెల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రైల్వే ప్రయాణం అందించడం కొరకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
News October 8, 2024
పెద్దపల్లి: ఉపాధికి ఉడుంపట్టు.. కాటమయ్య రక్షణ కవచం
కల్లుగీత కార్మికుల ప్రాణ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. గీత కార్మికులు చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టు జారకుండా ప్రత్యేక పరికరాలను అందజేస్తోంది. కాటమయ్య రక్షణ కవచం పేరిట ఆరు రకాల పరికరాల కిట్టును పంపిణీ చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఉచిత శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అవి పూర్తి కాగానే రక్షణ కవచాలను గీత కార్మికులకు ఉచితంగా అందజేయనుంది.
News October 8, 2024
KNR: సంతలో మహిళపై పండ్ల వ్యాపారి చెప్పుతో దాడి
కరీంనగర్ జిల్లా కేశవపట్నం వారసంతలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సంతలో పండ్లు అమ్ముకునే వ్యక్తి పక్కనే పూలు అమ్ముకునే మహిళపై అసభ్యంగా తిడుతూ చెప్పుతో దాడి చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేసి మహిళను అక్కడినుంచి పంపించారు. అయితే కొట్టిన వ్యక్తిని వదిలిపెట్టి దెబ్బలు తిన్న మహిళనే అక్కడినుంచి పంపేయడంతో పోలీసులు ఆ వ్యక్తికే వత్తాసు పలకడం పట్ల స్థానికులు విమర్శిస్తున్నారు.