News March 5, 2025
కరీంనగర్: చెల్లని ఓట్లు 28,686

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికలలో మొత్తం 2,52,029 మంది ఓటు వేయగా అందులో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లుబాటు కానట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. 1,11,672 ఓట్లను కోటా నిర్ధారణ ఓట్లుగా నిర్ణయించారు. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యత లభించింది.
Similar News
News November 22, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
News November 22, 2025
బిచ్కంద: రోడ్డుపై వడ్లు.. ఒకరి ప్రాణం తీసింది!

వడ్ల కుప్ప కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బిచ్కుంద SI మోహన్ రెడ్డి వివరాలిలా..లచ్చన్ వాసి కీర్తి రాజ్ (35) బరంగ్ ఎడిగి నుంచి బిచ్కుంద వైపు తన బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఖత్గావ్ చౌరస్తా సమీపంలో ఆరబోసిన వరి ధాన్యం కుప్పను కీర్తి రాజ్ బైక్తో ఎక్కించి, అదుపు తప్పి రోడ్డుపై పడి, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు.
News November 22, 2025
యాషెస్ టెస్టు.. 847 బంతుల్లోనే ముగిసింది

యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. 1895లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. అటు తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు 405 బంతులే(67.3 ఓవర్లు) ఎదుర్కొన్నారు. 1904 తర్వాత ఇంత తక్కువ ఓవర్లలో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్సులను ముగించడం ఇదే తొలిసారి.


