News March 26, 2025

కరీంనగర్: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

image

మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అమాత్య యోగం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం కేబినెట్లో ఉన్నారు.

Similar News

News September 16, 2025

ANU: ఏపీ ఎడ్ సెట్-2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు

image

ఏపీ ఎడ్‌సెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ స్వామి తెలిపారు. వెబ్ ఆప్షన్స్ గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించామన్నారు. కళాశాల మార్పునకు 18వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ 20వ తేదీన జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.

News September 16, 2025

కడియం శ్రీహరి దారెటు? రాజీనామా చేస్తారా?

image

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్‌కు MLA కడియం శ్రీహరి ఇంకా సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన తదుపరి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఇతర ఎమ్మెల్యేల తరహాలో BRSలోనే ఉన్నానని సమాధానం ఇస్తారా? రాజీనామా చేసి ఉపఎన్నికలో మళ్లీ గెలిచి విమర్శకుల నోరు మూయించాలనే యోచనలో ఉన్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే తనకు చివరి ఎన్నికలని గతంలో ప్రకటించిన ఆయన ఇప్పుడు రిస్క్ ఎందుకు అనుకుంటారా అనేది చూడాలి.

News September 16, 2025

SKLM: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

రాష్ట్ర రాజధానిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నిర్వహించిన సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పథకాలను సీఎం వివరిస్తూ, ఆయా జిల్లాలలో ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో కొన్నిటిని అమలు చేశామని తెలియజేశారు.