News March 26, 2025
కరీంనగర్: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు అమాత్య యోగం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం కేబినెట్లో ఉన్నారు.
Similar News
News December 1, 2025
GNT: ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా.!

ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు నేడు రాజీనామా చేయటం సంచలనంగా మారింది. వారు కొద్దిసేపటి క్రితం శాసనమండలి ఛైర్మన్ను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. రాజీనామా నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీతలు తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు.
News December 1, 2025
HYD: ఓన్లీ ప్రాఫిట్ నో లాస్ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్కు చెందిన ముఖేశ్ పాఠక్పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.
News December 1, 2025
నల్గొండ: పార్లమెంటులో సమస్యలపై గళమెత్తాలి..!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిసెంబర్ 19 వరకు జరిగే సమావేశాల్లో నియోజకవర్గాలలోని సమస్యలపై ఎంపీలు మాట్లాడి పరిష్కారం దిశగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


