News March 26, 2025
కరీంనగర్: జిల్లాకు మంత్రి పదవి దక్కేనా.!

మంత్రివర్గ విస్తరణ ఉగాదిలోపు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సీఎం రేవంత్ సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు లేక ఐదుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు అమాత్య యోగం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం కేబినెట్లో ఉన్నారు.
Similar News
News November 28, 2025
సూర్యాపేట జిల్లా గ్రామ ఓటర్ల లెక్క

సూర్యాపేట జిల్లాలో గ్రామ ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా గ్రామ ఓటర్లు ఉన్నట్లు 6,94,815 ఎన్నికల సంఘం ప్రకటించింది. గరిడేపల్లి మండలంలో అత్యధికంగా 46,796 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 22 మంది ఉన్నారు. మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
News November 28, 2025
జనగామ: ఏకగ్రీవం వైపు సీనియర్.. పోటీ వైపు జూనియర్!

జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్లో పలు పార్టీల నేతలు ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా.. ఏకగ్రీవం చేస్తే గ్రామానికి పనులు చేస్తామంటూ స్వంతంగా మేనిఫెస్టో తయారు చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ఏకగ్రీవానికి చోటు ఇవ్వం అన్నట్లుగా యువ రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. ఏదేమైనా గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్లు కావాలని ప్రజలు అంటున్నారు.
News November 28, 2025
జనవలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళు రద్దు (1/2)

➤ జనవరి 27న (17480)తిరుపతి – పూరి ఎక్స్ ప్రెస్
➤ 28న (17479)పూరి -తిరుపతి ఎక్స్ ప్రెస్
➤ 28న (22708)తిరుపతి -విశాఖ డబల్ డెక్కర్
➤ 29న (22707)విశాఖ -తిరుపతి )డబల్ డెక్కర్
➤ 28,29న (17219)మచిలీపట్టణం -విశాఖ ఎక్స్ ప్రెస్
➤ 29,30న (17220)విశాఖ -మచిలీపట్టణం ఎక్స్ ప్రెస్
➤ 31న (22876, 22875 ) గుంటూరు -విశాఖ,విశాఖ – గుంటూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు


