News March 25, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తపల్లి-ధర్మారం 37.7°C నమోదు కాగా, తాంగుల, ఈదులగట్టేపల్లి, బురుగుపల్లి, ఇందుర్తి 37.6, జమ్మికుంట, మల్యాల 37.5°C, నుస్తులాపూర్ 37.3, కరీంనగర్ 37.1, వీణవంక, గట్టుదుద్దెనపల్లె, పోచంపల్లి 36.9, గంగిపల్లి 36.8, తాడికల్ 36.5, బోర్నపల్లి 36.1, దుర్శేడ్, చింతకుంట, గుండి 36.0°C గా నమోదైంది.
Similar News
News March 31, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు…

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఇందుర్తి 40.6°C నమోదు కాగా, బురుగుపల్లి 40.5, జమ్మికుంట 40.3, వీణవంక 40.2, కొత్తపల్లి-ధర్మారం 40.1, ఖాసీంపేట 39.9, వెంకేపల్లి 39.7, బోర్నపల్లి 39.5, కొత్తగట్టు, దుర్శేడ్ 39.4, చింతకుంట, గంగాధర 39.3, ఆసిఫ్ నగర్, తాంగుల 39.0, రేణికుంట, కరీంనగర్ 38.8, ఈదులగట్టేపల్లి, మల్యాల 38.7, గుండి, నుస్తులాపూర్ 38.4°C గా నమోదైంది.
News March 31, 2025
ఇల్లందకుంట: ఏప్రిల్ 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం 13 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కల్యాణం, పట్టాభిషేకం, చిన్నరథం, పెద్దరథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ఉమ్మడి KNR జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.
News March 31, 2025
కరీంనగర్: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

KNR జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 17,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.