News March 10, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో జమ్మికుంట 38.3°C, గంగాధర 37.6, ఖాసీంపేట 37.2, కొత్తపల్లి-ధర్మారం 37.0, తాంగుల, ఇందుర్తి 36.4, ఈదులగట్టేపల్లి 36.3, వీణవంక 36.2, నుస్తులాపూర్ 36.0, రేణికుంట 35.4, బురుగుపల్లి, పోచంపల్లి 35.0, చిగురుమామిడి 34.9, గుండి 34.8, అర్నకొండ 34.5, గంగిపల్లి, మల్యాల 34.4, గట్టుదుద్దెనపల్లె 34.3, బోర్నపల్లి 34.1, తాడికల్ 34.0°C గా నమోదైంది.
Similar News
News October 26, 2025
కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

కరీంనగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.
News October 26, 2025
కరీంనగర్ మహాసభకు ‘తరలిన శ్రీనివాసులు’

చొప్పదండి మండలం నుంచి శ్రీనివాస నామదేయ మిత్రులు ఆదివారం పెద్దసంఖ్యలో KNRలో జరుగుతున్న తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వార్షికోత్సవ మహాసభకు తరలివెళ్లారు. కాగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఈ సభకు వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వార్షికోత్సవ మహాసభ సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం భవిష్యత్ కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News October 25, 2025
KNR: పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో “GIVE BLOOD – SAVE LIFE” నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పీటీసీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కళాశాల అధికారులను సీపీ అభినందించారు.


