News March 13, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 

image

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 39.9°C నమోదు కాగా, కొత్తపల్లి-ధర్మారం, వెంకేపల్లి 39.8, జమ్మికుంట 39.7, గంగాధర 39.6, ఖాసీంపేట 39.5, ఇందుర్తి, ఈదులగట్టేపల్లి 39.2, వీణవంక 39.0, నుస్తులాపూర్ 38.9, బోర్నపల్లి, తాంగుల 38.7, అర్నకొండ, గుండి 38.5, గంగిపల్లి 38.3, పోచంపల్లి 38.2, మల్యాల 38.0, దుర్శేడ్ 37.9, చింతకుంట 37.7, KNR 37.6°Cగా నమోదైంది.

Similar News

News March 14, 2025

కరీంనగర్: ప్రతి భవిత విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలి: కలెక్టర్

image

భవిత కేంద్రాలలో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్న ప్రతి దివ్యాంగ విద్యార్థికి ప్రొఫైల్ సిద్ధం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భవిత కేంద్రాలలో పనిచేస్తున్న ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్‌తో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. దివ్యాంగులకు మంజూరు చేసే యుడిఐడి కార్డుల పట్ల భవిత విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.

News March 14, 2025

కరీంనగర్: ఈవీఎం గోదాంను పరిశీలించిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌లను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాడ్ గోడౌన్‌లను తనిఖీ చేస్తున్నామని, ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి గోడౌన్ తనిఖీ చేశారు.

News March 14, 2025

చొప్పదండి: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన పూసాల రోహిత్(17) కరీంనగర్‌లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రోహిత్ పెద్దమ్మ రావుల అరుణ నిద్రలేచి చూడగా.. వరండాలో చీరతో ఉరేసుకుని కనిపించాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాడనే భయంతో ఉరేసుకున్నట్లు ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు. మృతుడి తల్లి కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

error: Content is protected !!