News July 16, 2024
కరీంనగర్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలు!

KNR వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. ఇందుకు ఒకే చోట నాలుగేళ్లు పూర్తైన వారు DPO ఆఫీస్లో దరఖాస్తులు అందజేశారు. ఈనెల 11 సా. వరకు ఆప్షన్ల గడువు ముగిసింది. జిల్లాలో 318 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుండగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శుల 185 మంది ఉన్నారు. ఈనెల 20 వరకు 88 మందికి బదిలీలకు అవకాశం ఉంది. పైరవీలకు తావు లేకుండా స్థానచలనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News November 18, 2025
కరీంనగర్: శీతాకాలంలో డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలి: సీపీ

శీతాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. రాత్రిపూట, తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగ మంచు కారణంగా దృశ్యమానత తగ్గి రోడ్డు ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాహనదారులు భద్రతను దృష్టిలో ఉంచుకొని.. నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని, పొగ మంచు ఉన్న సమయంలో ఓవర్టేక్ చేయవద్దని ఆయన సూచించారు.
News November 18, 2025
KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.
News November 18, 2025
KNR: డ్రగ్స్ మూలాలు పెకిలించివేయాలి: కలెక్టర్

యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తుపదార్థాల మూలాలను పెకిలించివేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నేడు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమ, విద్య తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. మత్తుపదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు CP తెలిపారు.


