News February 9, 2025
కరీంనగర్ జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.
Similar News
News December 27, 2025
సహకార రంగ బలోపేతమే దేశాభివృద్ధికి మూలం: ఈటల

సహకార వ్యవస్థ బలోపేతంతోనే దేశం ముందుకు సాగుతుందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. KNRలో జరిగిన డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పదవీ విరమణ సన్మాన సభలో పాల్గొన్నారు. రవీందర్ రావు డీసీసీబీ టర్నోవర్ను రూ.400 కోట్ల నుంచి రూ. 8 వేల కోట్లకు చేర్చడం స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగానికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలో అన్ని ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News December 27, 2025
లేజర్ గన్ ద్వారా 17,491 కేసులు నమోదు: KNR సీపీ

ప్రజా స్నేహిత పోలీసింగ్, ఆధునిక సాంకేతికతతో కరీంనగర్ నగరాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దుతామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. 2025 వార్షిక నేర సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ఉల్లంఘనపై 3.83 లక్షల ఈ-చలాన్లు, లేజర్ గన్ ద్వారా 17,491 కేసులు నమోదు చేశామన్నారు. పోలీసుల కఠిన చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గాయని, నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
News December 27, 2025
KNR: అల్ట్రాసౌండ్ కేంద్రాల్లో డీఎంహెచ్ఓ తనిఖీలు

కరీంనగర్లోని పలు అల్ట్రాసౌండ్, ఫీటల్ మెడిసిన్ కేంద్రాలను DMHO డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం రిజిస్టర్లు, ఫామ్-ఎఫ్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్లు, వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసిన ఆయన ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.


