News April 13, 2025
కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News November 11, 2025
లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దు: కలెక్టర్

లైసెన్స్ పొందకుండా వాహనాలు నడపొద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడమే కాకుండా కచ్చితంగా పాటించాలని సూచించారు. 18 ఏళ్ల నిండకుండా లైసెన్స్ పొందకుండానే వాహనాలు నడపొద్దని, సరైన శిక్షణ పొందకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. యువత రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు.
News November 11, 2025
మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.
News November 11, 2025
కల్తీ నెయ్యి కేసులో విచారణకు ధర్మారెడ్డి

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి సమీపంలోని సీబీఐ సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన భద్రతా వలయంలో లోపలికి చేరుకున్నారు. సిట్ డీఐజీ మురళీ రాంభా ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. రెండు రోజులు పాటు విచారణ జరగనుంది.


