News April 13, 2025
కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News October 3, 2025
దామోదర్ రెడ్డికి వీడ్కోలు ర్యాలీ

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఘనంగా కడసారి వీడ్కోలు పలికేందుకు నేడు సాయంత్రం 4 గంటలకు సూర్యాపేటలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కోర్టు, పోస్ట్ ఆఫీస్,పూల సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, రాఘవ ప్లాజా, నల్లలబావి, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్,గాంధీ బొమ్మ, కొత్త బస్ స్టాండ్, ఖమ్మం క్రాస్ రోడ్డు,రెడ్ హౌస్ వరకు ర్యాలీ కొనసాగనుంది.
News October 3, 2025
MBNR: దసరా EFFECT.. మాంసం దుకాణాలు కిటకిట

దసరా పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మాంసం దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి సహా పలు ప్రాంతాలలో శుక్రవారం ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా దుకాణాలు బంద్ కావడంతో, ఇవాళ మాంసం కొనుగోలు కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.
News October 3, 2025
RK రోజా ఇంట్లో విజయదశమి వేడుకలు

మాజీ మంత్రి RK రోజా ఇంట్లో నవదుర్గల పూజను గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని ఆరాధించడం ద్వారా భక్తులకు ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, విజ్ఞానం ప్రసాదిస్తుందని కుటుంబంలో సౌఖ్యం, ధైర్యం, ఆత్మబలం పెరుగుతాయని సమాజంలో శాంతి, సమగ్రత నెలకొంటుందని తెలిపారు. పిల్లలను దేవుళ్ళుగా భావించి, వారికి రోజా పాదపూజ చేశారు. అనంతరం వారికి భోజనం పెట్టి దుర్గమ్మ చల్లని చూపు ఉండాలన్నారు.
.