News April 13, 2025
కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News December 2, 2025
ఆదిలాబాద్: రూ.30 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,060గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ. 30 పెరిగినట్లు వెల్లడించారు.
News December 2, 2025
నల్గొండ: పవన్ కళ్యాణ్ SORRY చెప్పాలి: కోమటిరెడ్డి

తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. పవన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో, తెలియక మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే, తెలంగాణలో ఆయన సినిమాలు ఆడబోవని మంత్రి హెచ్చరించారు.
News December 2, 2025
చైనా మాంజాలపై నిర్మల్ పోలీసుల పంజా

జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని నిరోధించేందుకు జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పతంగులు ఎగరేసే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజ వినియోగం, రవాణా, నిల్వ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కిరాణా దుకాణాలు, చిన్నపాటి వ్యాపార కేంద్రాలను సందర్శించి చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


