News April 13, 2025
కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Similar News
News November 25, 2025
NTR: నేటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు.. త్వరపడండి

ఏపీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్(AFCOF)లో కాంట్రాక్ట్ పద్ధతిన 21 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25లోపు దరఖాస్తులను afcofcbbo@gmail.comకు మెయిల్ చేయాలని AFCOF ఎండీ డా.పి.సురేశ్ సూచించారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు https://fisheries.ap.gov.in/ వెబ్సైట్ చూడాలన్నారు.
News November 25, 2025
అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎస్పీ

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ బి. ఉమామహేశ్వర్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 62 మంది అర్జీదారులు ఎస్పీకి సమస్యలు విన్నవించుకున్నారు. సంబంధిత పోలీస్ అధికారులతో ఆయన మాట్లాడి అర్జీలను చట్ట పరిధిలో వేగవంతంగా విచారించాలన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
News November 25, 2025
కృష్ణా: బీపీఈడీ/డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ/డీపీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 3, 4, 5, 6 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరారు.


