News December 4, 2024
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల వ్యక్తి మృతి

కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి బైకుపై ఇద్దరు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారమిచ్చి గాయపడిన వ్యక్తిని KNR GOVT ఆసుపత్రికి తరలించారు..
Similar News
News July 11, 2025
ఆదిలాబాద్లో నేడే జాబ్మేళా

ADB తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో ఈనెల 11న HCL Technologies ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. 2024-25 సంవత్సరంలో MPC, MEC, CEC/BIPC, Vocational Computersలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 8074065803, 7981834205 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News July 10, 2025
ADB అదనపు కలెక్టర్కు ఐద్వా సర్వే రిపోర్ట్

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై వారం రోజులుగా సర్వే నిర్వహించారు. గురువారం సర్వే రిపోర్టును ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పాఠశాలల్లో, రిమ్స్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. బెల్ట్ షాపులను తొలగించాలని, కల్తీ కల్లును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మంజుల, జమున తదితరులున్నారు.
News July 10, 2025
సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన: ADB SP

బాలలు బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని, పిల్లలు కార్మికులుగా ఉండరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆపరేషన్ ముస్కాన్పై వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్లో సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన పది రోజుల వ్యవధిలో 37 మంది బాలల సంరక్షణ తోపాటు జిల్లావ్యాప్తంగా 10 కేసుల నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.