News August 20, 2024

కరీంనగర్ జిల్లాలో 90 డెంగ్యూ కేసులు

image

కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమల వ్యాప్తి అధికంగా పెరిగింది. డెంగ్యూ, చికున్ గున్యా లాంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News March 11, 2025

కరీంనగర్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. కరీంనగర్‌లో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

News March 10, 2025

కరీంనగర్: జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీపీ

image

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి పూల మొక్కను అందజేశారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.

News March 10, 2025

కరీంనగర్: 322 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ ఎగ్జామ్‌లో భాగంగా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 2 ప్రశాంతంగా ముగిసినట్లు సోమవారం జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 15,381 మంది విద్యార్థులకు గాను 15,059 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలకు 322 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!