News February 13, 2025

కరీంనగర్ జిల్లాలో MURDER.. ఇద్దరికి జీవిత ఖైదు

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన కేసులో జిల్లా సెషన్ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపారు. 2020 డిసెంబర్ 10న జరిగిన దాడిలో మెట్టుపల్లికి చెందిన రాచమల్ల సంపత్‌ను అదే గ్రామానికి చెందిన బోనగిరి జంపయ్య, బోనగిరి ఓదెలు దాడి చేసి చంపిన కేసులో వీరు ఇరువురికి రూ.2,500 జరిమానాతో పాటు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

Similar News

News February 19, 2025

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

image

AP: నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

News February 19, 2025

నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

image

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 19, 2025

టీమ్ ఇండియా ఆ పాక్ ఆటగాడితో జాగ్రత్తగా ఉండాలి: హర్భజన్

image

పాక్ ఆటగాడు ఫకర్ జమాన్‌తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ‘భారత్‌పై జమాన్ రికార్డు చాలా బాగుంది. గతంలో మన విజయావకాశాల్ని అతడు దెబ్బకొట్టాడు’ అని గుర్తుచేశారు. భారత్‌పై 6 మ్యాచులాడిన జమాన్ 46.80 సగటుతో 234 రన్స్ చేయడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల సమరం ఈ నెల 23న జరగనుంది.

error: Content is protected !!