News July 5, 2024
కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

కరీంనగర్ పరిషత్ పాలకవర్గాలకు గురువారంతో గడువు ముగియడంతో జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువారం నాటికి ఎంపీటీసీలు, జడ్పీటిసిల పదవీకాలం ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్కు అధికారులు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
Similar News
News May 7, 2025
KNR: జిల్లా స్పోర్ట్స్ స్కూల్ రాష్ట్రంలోనే మోడల్గా నిలవాలి: కలెక్టర్

కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. స్పోర్ట్స్ స్కూల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోనే రోల్ మోడల్గా ఉండేలా తీర్చిదిద్దాలని ఆమె సూచించారు.
News May 7, 2025
కరీంనగర్: రైతుల సంక్షేమం కోసమే భూభారతి: కలెక్టర్

రైతుల భూ సమస్యలు పరిష్కరించి,వారి సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ రైతువేదిక, కొత్తపల్లిలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ధరణి చట్టంలో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించలేదని, భూభారతి చట్టంలో మాత్రం పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు.
News May 7, 2025
కరీంనగర్ కొత్తపల్లి చెరువులో మృతదేహం

కరీంనగర్ కొత్తపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుడు కొత్తపల్లికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.