News February 16, 2025

కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News November 15, 2025

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి: హైకోర్టు

image

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెగా డీఎస్సీ 671వ ర్యాంకు సాధించిన రేఖ ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తమకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.

News November 15, 2025

గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందా?

image

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు గ్రేటర్‌ హైదరాబాద్ బలంగా ఉంది. అధికారాన్ని కోల్పోయినా గ్రేటర్ HYD పరిధిలోనే 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 2024 కంటోన్మెంట్ ఉపఎన్నికలో మాత్రం చతికిలపడింది. లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దించగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో గ్రేటర్‌లో కారు జోరు తగ్గుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News November 15, 2025

మెదక్: నేడు జిల్లాలో కవిత పర్యటన ఇదే

image

మెదక్ జిల్లాలో రెండవ రోజు శనివారం కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట షెడ్యూల్ ఈవిధంగా ఉంది. హవేలి ఘన్పూర్ మండలం కూచన పల్లిలో పాడి రైతులతో సమావేశం
2.రమేష్ కుటుంబ సభ్యుల పరామర్శ,
3.మెదక్‌లో ప్రెస్ మీట్,
4.మేధావులతో సమావేశం, బూరుగుపల్లి, రాజుపేట, వాడి, దూప్ సింగ్ తండాలో వరద బాధితుల పరామర్శ, 5.పొలంపల్లిలో కేవల్ కిషన్, చిన్నశంకరంపేట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.