News February 16, 2025

కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Similar News

News December 13, 2025

ఈనెల 18న ఆత్మకూరులో కబడ్డీ జిల్లా సెలక్షన్స్

image

యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతాయని జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రాజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డుతో పీఈటీ ఇందిరకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 25న ఖమ్మంలో ఆడునుందని పేర్కొన్నారు.

News December 13, 2025

చౌటుప్పల్: ‘ఆస్తులు పెరిగితే గ్రామానికే రాసిస్తా’

image

యాదాద్రి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం సర్పంచ్‌ అభ్యర్థి కొండ హారిక విజయ్ వినూత్నంగా హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం తన ఆస్తులు పెరిగితే ఆ పెరిగిన ఆస్తులన్నింటినీ గ్రామాభివృద్ధికి ప్రజల పేరున రాసిస్తానని బాండ్‌ పేపర్‌పై రాసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాగా హారిక విజయ్‌ హామీ ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

News December 13, 2025

మంచి నాయకుడి కోసం.. ఒక్కరోజు వెచ్చిద్దాం!

image

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ వజ్రాయుధమే. ఊరిని అభివృద్ధి చేసే సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఒక్కరోజు సెలవు, కూలీ డబ్బులు పోయినా పర్వాలేదు.. మన ఊరి భవిష్యత్తు కోసం వచ్చామన్న తృప్తి ముఖ్యం. మీ ఓటుతో మంచి నాయకుడు గెలిస్తే ఆ ఊరంతా బాగుపడుతుంది. అందుకే డబ్బు, బంధుప్రీతి వంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి. నిజాయితీ గల నాయకుడిని గెలిపించండి.