News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News December 13, 2025
GNT: ఇం’గలీస్’ టీచర్.. 8వ తరగతి విద్యార్థినిని ట్రాప్ చేసి..

పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పెడదారి పట్టాడు. 45 ఏళ్ళ వయస్సులో ప్రేమ పేరుతో 8వ తరగతి విద్యార్థినిని లోబర్చుకున్నాడు. గుజ్జనగుండ్లకు చెందిన కార్తీక్ పేరేచర్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ ఘటన తర్వాత బాలిక మేడికొండూరు PSకి వెళ్ళి సార్ తనను పెళ్ళి చేసుకున్నారని.. ఆయతోనే ఉంటానని అనడంతో పంచాయితీ జరుగుతోంది.
News December 13, 2025
‘కాకినాడ కాదని.. దూరంలోని అమలాపురం ఎందుకు?’

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని RCPM, మండపేటలను కాకినాడ లేదా తూ.గోలో కలపాలన్న డిమాండ్ తీవ్రరూపు దాలుస్తోంది. కాకినాడ కంటే జిల్లా కేంద్రం అమలాపురం దూరం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండపేట విలీనం జరిగినా పాలనాపరమైన ఇక్కట్లు తప్పలేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ సమస్య పరిష్కారంలో మంత్రి సుభాష్ విఫలమయ్యారని, ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
News December 13, 2025
APPLY NOW: డిగ్రీ అర్హతతో 451 పోస్టులు

UPSC త్రివిధ దళాల్లో 451 పోస్టులను కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ -2026 ద్వారా భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -24ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


