News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News November 20, 2025
గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిశాక BRS నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు KTR బుధవారం దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా తమ ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు. GHMCలో ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.
News November 20, 2025
MBNR: U-17, 19.. రేపు సాఫ్ట్ బాల్ ఎంపికలు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలను ఈనెల 21న మహబూబ్నగర్లోని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, సొంత గ్లాజ్లు తీసుకొని ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు 99592 20075, 99590 16610 సంప్రదించాలన్నారు.
News November 20, 2025
పోలవరం: రోడ్డు ప్రమాదంలో డిజిటల్ అసిస్టెంట్ మృతి

పోలవరంలో బుధవారం జరిగిన యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు..పొలవరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ రామారావు విధులు ముగించుకొని బుట్టాయిగూడెనానికి వస్తుండగా మార్గంమధ్యలో ట్రాక్టర్ను ఢీకొని మృతి చెందినట్లు చెప్పారు. ఈయన భార్య బుట్టాయిగూడెంలో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఎస్సై దుర్గ మహేశ్వర రావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఆస్పుత్రికి తరలించారు


