News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News December 22, 2025
రెండో పెళ్లిపై మారుతున్న దృక్పథం

భారతీయుల్లో రెండో పెళ్లిపై అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. రీబౌన్స్ మ్యాచ్మేకింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో విడాకులు తీసుకున్న వారిలో 28% మంది మళ్లీ పెళ్లికి సిద్ధమని వెల్లడించారు. గతం తమ భవిష్యత్తును డిసైడ్ చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ మార్పులో మహిళలే ముందుండటం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆలోచనా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సమాజంలో మారుతున్న ఈ ఆలోచనా విధానంపై మీ Comment?
News December 22, 2025
ఏర్పేడు: ముగిసిన ఇంటర్ స్పోర్ట్స్ మీట్.!

తిరుపతి IIT వేదికగా జరుగుతున్న 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారంతో ముగిసింది. ఐఐటీ మద్రాస్ కార్పొరేట్ రిలేషన్స్ డీన్ అశ్విన్ మహాలింగం అతిథిగా హాజరయ్యారు. విజేతలు వీరే:
> చెస్ విజేత : IIT బాంబే రన్నర్ : మద్రాస్
> మహిళల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : ఢిల్లీ
> పురుషుల టెన్నిస్ విజేత : IIT మద్రాస్ రన్నర్ : కాన్పూర్
> వెయిట్ లిఫ్టింగ్టీం ఛాంపియన్ : IIT రూర్కీ.
News December 22, 2025
తిరుపతి: ‘కరంటోళ్ల జనబాట’కు ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం

ఏపీఎస్పీడీసీఎల్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా సీఎండీ శివశంకర్ ‘కరంటోళ్ల జనబాట’ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 22వ తేదీన పాకాల మండలంలో మంత్రి రవికుమార్ దీనిని ప్రారంభించనున్నారు. విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.


