News February 16, 2025
కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Similar News
News January 8, 2026
ED రైడ్స్.. IPAC ఆఫీసుకు మమత పరుగులు

<<18796717>>ED రైడ్స్<<>>తో WBలో రాజకీయ వేడి రాజుకుంది. తనిఖీలు జరుగుతున్న కోల్కతా సాల్ట్లేక్లోని IPAC ఆఫీసుకు CM మమత చేరుకున్నారు. బిల్డింగ్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు క్లోజ్ చేసి ఉండడంతో బేస్మెంట్లోని లిఫ్ట్లో 11వ ఫ్లోర్లోని IPAC ఆఫీసులోకి వెళ్లారు. ఆమె, పోలీసులు కలిసి ED రైడ్స్ను అడ్డుకున్నారని BJP ఆరోపించింది. దీదీ చర్యలను BJP నాయకులు ఖండిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.
News January 8, 2026
అందోల్: ఆరోగ్యశ్రీ ఉద్యోగి సూసైడ్

అందోల్ మండలం సంగుపేట గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కమ్మరి రవీందర్(39) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రవీందర్ 12 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రవీందర్ మరణంతో భార్య, కుమారుడు అనాథలయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 8, 2026
కోళ్ల దాణా నిల్వలో ఈ జాగ్రత్తలు పాటించండి

కోళ్ల దాణా బస్తాలను గోడలకు, నేలకు తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. రెండు వరుసల మధ్య 2 అడుగులు ఖాళీ ఉంచాలి. బాగా ఎండి, పొడిగా ఉన్న ముడి సరుకులనే నిల్వ చేయాలి. చలికాలంలో దాణాలో తేమ 9 శాతం కంటే ఎక్కువగా ఉండకూడదు. దాణాను 2-3 వారాలకు మించి నిల్వ చేయకూడదు. వేడిగా ఉన్న దాణా లేదా ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాముల్లో నిల్వ చేయాలి. లేకుంటే దాణా ఉంచిన బస్తాలపై తేమ పేరుకొని బూజు పడుతుంది.


